ఈసారి ముందుగానే తొలకరి పలకరింపు.. వాతావరణ శాఖ కీలక సూచన

కలం, వెబ్ డెస్క్ : ప్రతీ సంవత్సరం జూన్ సెకండ్ వీక్‌లో పలకరించే తొలకరి జల్లులు ఈసారి (Monsoon 2026) ముందుగానే రానున్నాయి. హిందు మహాసముద్రం నుంచి వచ్చే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను రెండు వారాల ముందే తాకుతాయని, చల్లని గాలులతో ప్రారంభమై నెలాఖరుకల్లా కేరళ, తమిళనాడు మీదుగా దక్షిణ భారతాన్ని టచ్ చేస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది జూన్ మూడవ వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఈసారి కాస్త ముందుగానే వస్తాయని తెలిపింది. అదే సమయంలో ఎల్‌నినో ప్రభావం కూడా ఉంటుందని గతంలోనే చెప్పినందున వర్షపాతం గతేడాది కంటే తగ్గుతుందా.. లేక అదే స్థాయిలో వస్తుందా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>