కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ – అమెరికా ఉద్రిక్తత ల కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి ఇరాన్ చేసిన ప్రతిపాదన పై ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ ప్రతినిధులు గా చెప్పుకుంటున్న పాకిస్తాన్ అధికారుల నుంచి వచ్చిన సీజ్ ఫైర్ ఒప్పందం ఆమోదయోగ్యమైనవి కావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు చేసిన ప్రతిపాదనలు చదివానని అవి నచ్చలేదని ట్రంప్ వెల్లడించారు.
అంతకుముందు అమెరికా శాంతి ప్రతిపాదనపై ఇరాన్ స్పందించింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూపుపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగిస్తున్న లెబనాన్తో సహా, ఈ ప్రాంతమంతటా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడంపై దృష్టి సారించిచాలని ఇరాన్ కోరింది.

