కలం, వెబ్ డెస్క్: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలకొండ జంక్షన్ దగ్గర రేసింగ్ బైక్, కారు ఢీ కొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాలకొండ జంక్షన్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

