కలం, వరంగల్ బ్యూరో: నర్సంపేట (Narsampet) ఆర్డీవో కార్యాలయంలో విషాదం నెలకొంది. డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. శ్రీనివాస్ ఆఫీసులోనే కుప్పకూలి పడిపోవడంతో సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు కోల్పోవడంతో రెవెన్యూ సిబ్బందిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

