epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ పాటలకు కాపీరైట్ వర్తించదు: ఢిల్లీ హైకోర్టు

కలం, వెబ్​డెస్క్​: పాటలకు సౌండ్​ రికార్డింగ్​ కాపీరైట్ (Sound Recording Copyright)​ విషయంలో ఢిల్లీ హైకోర్టు సరికొత్త తీర్పు నిచ్చింది. సౌండ్​ రికార్డింగ్​ పూర్తయిన 60 ఏళ్లకు లైసెన్స్​ గడువు ముగుస్తుందని, దానికి కాపీరైట్​ వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కేసులో ఇచ్చిన తీర్పును విశదీకరించింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బిగ్​నెట్​ సొల్యూషన్స్​ ఎల్​ఎల్​పీ ఆర్గనైజర్స్​.. ఒక ఈవెంట్​లో పాత పాటలు ప్లే చేసేందుకు ప్రయత్నించగా, వాటి సౌండ్​ రికార్డింగ్​పై తమకు హక్కులున్నాయంటూ నోవాక్స్​ సంస్థ అడ్డుకుంది. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ఈ సందర్భంగా  కాపీరైట్​ చట్టం 1957లోని  సెక్షన్​ 27 ప్రకారం ఏదైనా సౌండ్​ రికార్డింగ్​కు గడువు 60 ఏళ్లు మాత్రమే ఉంటుందని ఢిల్లీ హైకోర్టు(Delhi HC) స్పష్టం  చేసింది. ఆ తర్వాత అది ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లేనని, దానిని​ వాడుకోవడానికి ఎలాంటి లైసెన్స్​ అవసరం లేదని పేర్కొంది.

ఈ తీర్పు ప్రకారం 1965కు ముందు రికార్డయిన చాలా పాటల సౌండ్​ రికార్డింగ్​ లైసెన్స్​ గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. భారతీయ సినిమాకు స్వర్ణయుగంగా భావించే ఆనాటి రోజుల పాటల సౌండ్ రికార్డింగ్ ​పై ఇకమీదట  ఎలాంటి లైసెన్స్​ ఉండదు. వాటిని అందరూ వాడుకోవచ్చు. కాగా, పెళ్లిళ్లు, ఉత్సవాలు, జాతరలు వంటి శుభకార్యాల్లో పాటలను ప్లే చేయడం కాపీరైట్​ కిందకు రాదని, ఆ పాటలకు ఏ ఒక్కరూ రాయల్టీ వసూలు చేయవద్దని రెండేళ్ల కిందటే డిపార్ట్​మెంట్ ఫర్​ ప్రమోషనల్​ ఇండస్ట్రీస్​ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​(డీపీఐఐటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఏదైనా పాటపై హక్కు ఉన్న రచయిత/స్వరకర్త మరణించిన 60 ఏళ్ల తర్వాత సాహిత్యం, సంగీతంపై వాళ్లకు హక్కు పోతుంది. ఇప్పుడు సౌండ్​ రికార్డింగ్​కు సైతం అదే గడువు వర్తించనుంది. పాట సౌండ్​ రికార్డయిన నాటి నుంచి 60 ఏళ్ల వరకు మాత్రమే వాటికి లైసెన్స్​ ఉంటుందని, ఆ తర్వాత వాటికి కాపీరైట్​ చట్టం వర్తించదని ఢిల్లీ హైకోర్టు(Delhi HC) తీర్పు చెబుతోంది.

Read Also: బీజేపీ విధానాల‌తో చిరువ్యాపారుల‌కు తీవ్రనష్టం : రాహుల్ గాంధీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>