epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీ గాలి పీలిస్తే.. ధూమపానం చేసినట్టే!

Delhi Air pollution |పేరుకే దేశ రాజధాని.. అక్కడ అడుగుపెడితే పొగమంచు, తీవ్ర కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో కనీసం గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయి. రోజురోజుకూ పడిపోతున్న గాలి నాణ్యత ప్రమాణాలతో ఢిల్లీవాసులు మాస్కులు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గాలి పీలిస్తే.. ధూమపానం చేసినట్టేనని పలు హెల్త్ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రతిరోజూ హానికరమైన గాలిని పీలుస్తూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీలో ఒకరోజుపాటు ఉంటే అనేక సిగరెట్లు తాగిన ప్రమాద తీవ్రత ఉంటుందని డాక్టర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలోని గాలి శ్వాస తీసుకోవడం దాదాపు రోజుకు 23–45 సిగరెట్లను తాగినట్లే వైద్యులు సూచిస్తున్నారు. కలుషిత గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశించి వాపు, ఆక్సిడేటివ్, ఒత్తిడి, ఊపిరితీత కణాలకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుందట.ఇదే పరిస్థితి ముందుముందు ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.

Delhi Air pollution | వాయు కాలుష్యం కేవలం కనిపించే కణాల కంటే ఎక్కువ కలిగి ఉంటుంది. ఆ గాలిలో దాగి ఉన్న సీసం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు ఉండొచ్చు. ఈ లోహాలు మీకు తెలియకుండానే శరీరంలోకి చొచ్చుకుపోతాయి. అవి మీ ఊపిరితిత్తులలోకి లోతుగా ప్రయాణించి, రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా, గుండె, కాలేయం మెదడును కూడా ప్రభావితం చేస్తాయి. పిల్లలు, వృద్ధుల శరీరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాయు కాలుష్యం మరింత ప్రమాదకరం. ఇప్పటికైనా ఢిల్లీలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

Read Also: బీజేపీ డబుల్ గేమ్.. అక్కడ అలా, ఇక్కడ ఇలా!!

Follow Us On: WhatsApp Channel

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>