కలం, వెబ్ డెస్క్: ఈ-గవర్నేన్స్ పై కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రెటరీ డాక్టర్ టివి సోమనాథన్ (T. V. Somanathan) ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నేన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను సోమనాథన్ ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న simplegov ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలలో ఉన్న నిబంధనల మేరకు సేవలను అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao).. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ (E-Governance Model) విధానాన్ని వివరించారు.
ప్రజలకు పాదర్శకంగా సులభతరమైన పౌర సేవలను అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్ లైన్ లో డ్యాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. అలాగే మున్సిపల్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, రెవెన్యూ తదితర శాఖల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ మేరకు రామకృష్ణారావును ఈ-గవర్నెన్స్ విధానంపై కేబినెట్ సెక్రెటరీ సీఎస్ అభినందించారు. ఈ మీటింగ్ లో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ముఖ్యకార్యదర్శి యోగితారాణా, షీకాగోయల్, సెక్రెటరీలు రఘునందన్ రావు, శ్రీధర్, అనితా రామచంద్రన్, హౌసింగ్ ఎండీ వి.పి. గౌతం, సెర్పు సిఇఒ దివ్య, తదితరులు పాల్గొన్నారు.

