కేరళ సీఎంపై విమర్శలా?.. రేవంత్‌పై ఖమ్మం సీపీఐ నేతలు ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పినరయ్ విజయన్ పట్ల చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ ఖమ్మం (Khammam) జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్​ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేరళ సీఎం విజయన్​ను మోడీతో పోల్చారని మండిపడ్డారు. బలమైన సిద్ధాంతాలతో పనిచేసే ఎల్డీఎఫ్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్​లో వామపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి ఈ విషయాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అధికారం కోసం దిగజారుడు ప్రచారం తగదన్నారు. పనిచేసే నేతలపై విమర్శలు చేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు.

Read Also: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుందా.. అయితే బీఅలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>