కలం, వెబ్ డెస్క్ : ‘జయా ఆంటీ మాలుమ్ తేరా కో.. లల్లు అంకుల్ మాలుమ్ తెరకో’ అంటే కుదరదని సజ్జనార్ (CP Sajjanar) మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు కొందరు యువకులు అతిగా రియాక్ట్ అవుతుంటారు. మా నాన్న ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? అంటూ పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగుతుంటారు. వాళ్ల పేరు చెప్పుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
మరీ ముఖ్యంగా డ్రంక్ డ్రైవ్ (Drunk and Drive) లో పట్టుబడ్డప్పుడు యువకులు వాళ్లు తెలుసా.. వీళ్లు తెలుసా? అంటూ పోలీసుల అధికాకరులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాటిపై హైదరాబాద్ సజ్జనార్ తనదైన రీతిలో స్పందించారు. నూతన సంవత్సరం వేళ మందు బాబులకు ఆయన ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఊరుకోబమని హెచ్చరించారు. తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయిన వారు మా నాన్న తెలుసా.. మా అంకుల్ తెలుసా.. అన్న తెలుసా అంటూ తమ అధికారుల దగ్గర మాట్లాడొద్దని సజ్జనార్ సూచించారు.
‘మా డాడి ఎవరో తెలుసా.. మా అంకుల్ ఎవరో తెలుసా.. అన్న ఎవరో తెలుసా అని మా ఆఫీసర్లను అడగొద్దు. మేము మీ ప్రైవసీకి రెస్పెక్ట్ ఇస్తాము. వెహికిల్ పక్కకు పెట్టి, మళ్లీ డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని సజ్జనార్ (CP Sajjanar) ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఇలా ‘Ma daddy evaro telusa’, ‘ma uncle evaro telusa’, ‘anna evaro telusa’… aani maa officers ki అడగొద్దు. Memu mee privacy ni respect chestham. Vehicle pakaku petti, malli date vachina roju Court lo parichayam chesukundam. #Hyderabad Police bole toh — Zero tolerance to drunk… https://t.co/ZpNHRzDA5G
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2025
Read Also: హైదరాబాద్ పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు..
Follow Us On : WhatsApp


