కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)ను నేడు పోలీసులు హైకోర్ట్లో ప్రవేశపెట్టనున్నారు. నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్ట్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరుగనుంది. అలాగే అంబటి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై కూడా నేడే విచారణ జరుగనుంది. స్పెషల్ మొబైల్ కోర్ట్ ఈ కేసులను విచారించి తీర్పు ఇవ్వనుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదైనట్లు సమాచారం.


