epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫోన్​ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో సిట్​ (Special Investigation Team) ఏర్పాటు చేసింది. సీపీ సజ్జనార్​ (CP Sajjanar) ఆధ్వర్యంలో సిట్​ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ సజ్జనార్​ నేతృత్వంలో ఐదుగురు ఐపీఎస్​ అధికారులతో సహా మొత్తం 9 మంది అధికారులతో సిట్​ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా అంబర్​ కిషోర్​ ఝా, ఎస్​.ఎం విజయ్​ కుమార్​, రితురాజ్, నారాయన్​ రెడ్డి, రవీందర్​ రెడ్డి, కే.ఎస్​.రావు, వెంకటగిరి, నాగేందర్​ రావు, శ్రీధర్​ ఉన్నారు. కాగా, రేపు (శుక్రవారం) ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case) పై సుప్రీం కోర్టులు తీర్పు ఉన్న నేపథ్యంలో సిట్​ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>