epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్​ చైర్మన్ ఎన్నికల పరిశీలకులను నియమించిన కాంగ్రెస్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ మున్సిపాలిటీల పాలకవర్గం ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం చైర్​ పర్సన్​, వైస్​ చైర్​ పర్సన్ల ఎన్నిక దాదాపు పూర్తయింది. కానీ, కోరం లేకపోవడం, హంగ్​ ఫలితాలు వచ్చిన కారణంగా 8 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్​ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ రేపటికి (మంగళవారం) వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ మిగిలిన మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడానికి వ్యూహాలను పన్నుతోంది. నేతలు, నాయకులు, అభ్యర్థులను సమన్వయం చేసుకోవడానికి చైర్మన్​ ఎన్నిక వాయిదా పడ్డ మున్సిపాలిటీలకు టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ (Mahesh Kumar Goud)​ పరిశీలకులను నియమించారు.

తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి, ఎమ్మెల్యే కే.ఆర్​ నాగరాజును నియమించారు. ప్రభుత్వవిప్​, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణలకు జనగాం బాధ్యతలను అప్పగించారు. ఇబ్రహీం మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యేలు బాలు నాయక్​, వీర్లపల్లి శంకర్​. క్యాతన్​ పల్లి మున్సిపాలిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఖానాపూర్​ మున్సిపాలిటీ పరిశీలకులుగా ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​, ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియమించింది. ఇంద్రేశం మున్సిపాలిటీ ఎమ్మెల్యేలు పీ.రామ్మోహన్​ రెడ్డి, శ్రీగణేష్​. కాగజ్​ నగర్​ మున్సిపాలిటీకి సలహాదారు పీ.సుదర్శన్​ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్​ సాగర్​ నియమించింది. మంత్రి అజారుద్దీన్​, ఎమ్మెల్యే సంజీవరెడ్డి లకు జహీరాబాద్ మున్సిపాలిటీ బాధ్యతలను టీపీసీసీ చీఫ్​ (Mahesh Kumar Goud) అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>