కలం, జనగామ: తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పీఏపై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. చైర్మన్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు.


