కలం, జనగామ: జనగామ (Jangaon) మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక డ్రా పద్దతిలో ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 30 వార్డులకుగాను కాంగ్రెస్, బీఆర్ఎస్ సగం, సగం సీట్లు సాధించడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది. ఈ మేరకు సోమవారం ఉదయం మున్సిపాలిటీ కార్యాలయానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లతోపాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల తరఫున ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ (BRS) నుంచి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.


