కలం, డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడవుతూనే ఉన్నాయి. ఈ ఫలితాల్లో స్టేషన్ ఘన్ పూర్ లో (Station Ghanpur Municipality) బీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. ఇక్కడి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారు అంటూ బీఆర్ ఎస్ కోర్టుల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. కడియంపై (Kadiyam Srihari) బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేసింది. ఇలాంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మెజార్టీ సీట్లు సాధించారు. మొత్తం 18 వార్డులకు గాను 13 స్థానాల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ ఎస్ గెలిచాయి. దీంతో కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కడియం శ్రీహరి ఎన్నికల్లో వరుస ప్రచారాలు చేశారు.
Read Also: డీకే అరుణ ఇలాకాలో బీఆర్ఎస్ విజయం… ఐజ మున్సిపాలిటీ కైవశం
Follow Us On: Pinterest


