కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavya)పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 2025 లోనే వరంగల్ కార్పొరేషన్ లో ఆమె ఎక్స్ అఫీషియో ఓటు తీసుకున్నారని తొర్రూరులో ఓటు ఎలా వేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అవసరం కోసం ఇప్పుడు తొర్రూరు వస్తా అంటే ఎట్లా అని ప్రశ్నించారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ కడియం కావ్య కు ఓటు వేసే అవకాశం ఇవ్వద్దని ఆమె కోరారు. ఆమెతో పాటు మహబూబాబాద్ బీఆర్ఎస్ యువజనవిభాగం అధ్యక్షుడు యాళ్ళ మురళీధర్ రెడ్డి ఉన్నారు.


