Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఎందుకంటే?

క‌లం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మ‌రోసారి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జూన్‌ 11న నీతి అయోగ్ (NITI Aayog) 11వ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ స‌మావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ప్ర‌ధానితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై చర్చించ‌నున్నారు. గురువారం రాష్ట్ర‌ప‌తి భవన్‌లో ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జ‌రుగ‌నుంది. ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర,రాష్ట్ర సంబంధాలు, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి రాష్ట్రానికి రానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>