epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి డిన్నర్

కలం, వెబ్ డెస్క్:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ (CM Revanth Reddy)  పర్యటనకు బయలుదేరారు. ముంబైలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. AI ఇంపాక్ట్ సమ్మిట్-2026లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న డిన్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సాంకేతిక రంగ ప్రతినిధులు అంతర్జాతీయ అతిథులు ఈ విందులో పాల్గొనే అవకాశముందని ఉందని తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై ఈ సమ్మిట్ కీలకంగా భావిస్తున్నారు. తెలంగాణను ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో సీఎం ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గురువారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సాంకేతిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చలు కూడా జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>