కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలో అత్యధికంగా ఐటీ ఎగుమతులు సైబరాబాద్ నుంచే ఎగుమతి అవుతన్నాయని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లితో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలు అనేక సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరానికి అలాంటి ఇబ్బందులు రాకూడదనే తెలంగాణ రైజింగ్ 2047 ద్వారా నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నిపుణుల సూచనలతో క్యూర్ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సీఎం (CM Revanth) వెల్లడించారు. హైదరాబాద్ విస్తరణతో పాటు అభివృద్ధి పనులకు బీజేపీ ఎంపీలు నిధులు తీసుకురాకుండా పొంకనాలు కొడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేసుకుంటే ఇబ్బంది ఏంటని.. గుజరాత్ గులాములుగా ఎందుకు పని చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ దుయ్యబట్టారు.
Read Also: సిరిసిల్ల ఇసుక మాఫియాపై CID పంజా.. ఆ నేతల్లో అలజడి!
Follow Us On: Instagram

