కలం, వెబ్ డెస్క్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మియాపూర్ వేదికగా మొత్తం రూ.1,674.74 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా ఖానామెట్ పరిధిలో రూ.161 కోట్లతో అత్యాధునికంగా నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి, అలాగే మియాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూ.530 కోట్లతో నిర్మించనున్న భారీ ఫ్లైఓవర్ పనులకు సీఎం భూమి పూజ చేశారు. అలాగే రూ.65.53 కోట్లతో పూర్తయిన బాచుపల్లి ఫ్లై ఓవర్ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. శేరిలింగంపల్లి ఆర్ఓబీ, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపనలు చేశారు.
Read Also: ఆసియన్ టూర్ టాప్-10లో కరందీప్ కోచ్చర్
Follow Us On: Instagram

