epaper
Sunday, March 1, 2026
epaper

బాలసరస్వతి మరణంపై సీఎం రేవంత్ సంతాపం

తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతి(Rao Balasaraswathi) మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంతాపం తెలిపారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. .‘సతీ అనసూయ’ సినిమాలో తొలి పాటను పాడారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ఆమె 2000కుపైగా పాటలు ఆలపించారు. అదే సినిమాలో గంగ పాత్రలో తన నటనను కూడా కనబరిచారు.

Read Also: కేసీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదో చెప్పిన కవిత..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!