కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన జన్మదిన వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. విజయవాడలోని ఓ అన్న క్యాంటీన్ (Anna Canteen)లో ప్రజలతో కలిసి, సీఎం చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అలాగే రాయపూడిలో నూతన అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు ఉండగా, దీంతో ఈ సంఖ్య 270కి చేరింది. అన్న క్యాంటీన్లోనే ప్రజలు, కార్మికుల మధ్య సీఎం పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. చంద్రబాబు 76వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం అందించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని క్యాంటీన్లలో నేడు ఉచిత భోజనం అందించనున్నారు.

