epaper
Monday, March 2, 2026
epaper

చంద్రయాన్-4 ప్రయోగం జరిగేది అప్పుడే..

ప్రాజెక్ట్ చంద్రయాన్-4(Chandrayaan 4)కి సంబంధించి ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్‌ను ప్రయోగించేది ఎప్పుడు? అన్న అంశంపై స్పష్టం చేసింది. భారత్ నిర్వహించబోయే తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయాణం 2027లో జరుగుతుందని సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు ముఖ్యమైన ప్రయోగాలను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇప్పటికే వెల్లడించారు. ఈ మిషన్‌లలో కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పాటు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో, Chandrayaan 4 మిషన్‌ పై కీలక వివరాలను ఆయన వెల్లడించారు. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకువచ్చే విధంగా రూపొందిస్తున్న ఈ మిషన్, ఇస్రో చరిత్రలో అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. అలాగే జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ JAXAతో కలిసి అమలవుతున్న LUPEX మిషన్ ద్వారా చంద్రుడి ధ్రువ ప్రాంతాల పరిశీలన కూడా జరగనుందని, ముఖ్యంగా దక్షిణ ధ్రువంలోని నీటి మంచును అధ్యయనం చేయడాన్ని లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు.

అంతరిక్ష పరిశోధనల్లో వేగాన్ని పెంచుతున్న ఇస్రో, ఏడాదికి తన అంతరిక్ష నౌకల తయారీ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచేందుకు చర్యలు చేపడుతోంది. చంద్రయాన్–4 ద్వారా చంద్రుడి నుండి నమూనాలను భూమికి తిరిగి తీసుకురావాలన్న లక్ష్యం పెట్టుకోవడం ద్వారా, ఇలాంటి కార్యాన్ని ఇప్పటివరకు సాధించిన అమెరికా, చైనా జాబితాలో భారత్ కూడా చేరదలచుకుంది.

ఇంకా, స్వంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలనే ప్రణాళికలను కూడా నారాయణన్ వెల్లడించారు. ఐదు మాడ్యూళ్లతో రూపొందించే ఈ కేంద్రాన్ని 2028 నాటికి కక్ష్యలో ప్రవేశపెట్టడమే లక్ష్యం, 2035 నాటికి పూర్తిగా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాసా నిర్వహిస్తున్న ఐఎస్ఎస్, చైనా నిర్వహిస్తున్న తియాంగాంగ్ వంటి అంతరిక్ష కేంద్రాల మాదిరిగా భారతకూ స్వంత కేంద్రం ఉండనుంది.

Read Also: అక్కడ లాలూ కుమార్తె.. ఇక్కడ కేసీఆర్ బిడ్డ

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!