కలం, వెబ్డ డెస్క్ : ఆయుధాలను వీడని వాళ్ల అంతు చూస్తామని మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హెచ్చరించారు. సోమవారం ఆయన పార్లమెంట్ లో మావోయిస్టుల నిర్మూళనపై స్టేట్ మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే దేశంలో మావోయిస్టులు విపరీతంగా పెరిగారని ఆరోపించారు. ఆదివాసుల హక్కులను రక్షిస్తామని చెప్పారు. ఒకప్పుడు నక్సల్స్ కు అడ్డాగా ఉన్న బస్తర్ ప్రాంతం నేడు అభివృద్ధి వైపు దూసుకుపోతుందని వెల్లడించారు. మావోయిస్టులు లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని షా హామినిచ్చారు. లొంగుబాటుకు రేపటితో (మంగళవారం) కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ ముగియనుందని గుర్తు చేశారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అమిత్ షా కోరారు.
Read Also: ఆహార కల్తీపై ఉక్కుపాదం.. నెల రోజుల్లో 61 కేసులు, 15 టన్నుల పదార్థాల సీజ్
Follow Us On : WhatsApp

