వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మ‌రో భారీ ప్యాకేజ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant)ను న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించి పూర్తిస్థాయి లాభాల్లోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో భారీ ఆర్థిక ప్యాకేజ్‌ని సిద్ధం చేసింది. స్టీల్ ప్లాంట్ పున‌రుద్ధ‌ర‌ణ , ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు రూ.8,097 కోట్ల అద‌న‌పు నిధుల కేటాయింపున‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఆమోదం తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర ఆర్థిక శాఖ‌కు పంపించారు. గ‌తంలో ప్ర‌క‌టించిన రూ.11,500 కోట్ల ప్యాకేజ్‌కి అద‌నంగా ఇప్పుడు రూ.8,097 కోట్ల‌ను కేంద్రం ఈక్విటీ రూపంలో స‌మ‌కూర్చ‌నుంది. కేంద్ర కేబినేట్ ఆమోదం పొందిన వెంట‌నే ఈ నిధులు విడుద‌ల కానున్నాయి. త‌ద్వారా నిధుల కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వ‌హ‌ణ మెరుగుప‌డ‌టంతోపాటు పారిశ్ర‌మికంగా వృద్ధి చెందుతుంద‌ని కేంద్రం భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>