కలం, వెబ్డెస్క్: సినీ నటుడు, టీవీకే అధిపతి విజయ్ (TVK Chief Vijay) కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిలాస ఘటనలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది. ఈ మేరకు జనవరి 12న విజయ్ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీకి చెందిన పలువురు నాయకులను సీబీఐ ప్రశ్నించింది. కరూర్ దుర్ఘటనకు సంబంధించి వివరాలు సేకరించింది. త్వరలో ఈ కేసుపై ఛార్జిషీట్ వేయనుండడంతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను కూడా ప్రశ్నించాలని నిర్ణయించింది.
ఈ మేరకు నోటీసులు పంపింది. కాగా, నిరుడు సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ బహిరంగ సభ, ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. మరోవైపు కరూర్ దుర్ఘటన అనంతరం విజయ్ బహిరంగ సభలకు, ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తోంది.

Read Also: సిడ్నీలో స్మిత్ రికార్డుల మోత
Follow Us On: Instagram


