కలం, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్(TVK Chief Vijay)కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరవ్వాలని నోటీసులలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్పై సీబీఐ (CBI) కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు సంబంధించి జనవరి 12న సైతం విజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా మరోసారి విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
Read Also: మనవాళ్లను క్షేమంగా తీసుకొస్తాం: రామ్మోహన్ నాయుడు
Follow Us On : WhatsApp

