మనవాళ్లను క్షేమంగా తీసుకొస్తాం: రామ్మోహన్​ నాయుడు

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియా, గల్ఫ్​ కంట్రీస్​లో యుద్ధం వల్ల చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి క్షేమంగా తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ రామ్మోహన్​ నాయుడు(Ram Mohan Naidu) అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్​లో మాట్లాడుతూ ప్రతిపక్షాల ప్రశ్నకు జవాబిచ్చారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నందున విమానాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితులు మెరుగు పడగానే పూర్తిగా విమాన సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. యుద్ధ ప్రభావం వల్ల తాత్కాలింగా కొన్ని సర్వీసులు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నట్లు సభకు వెల్లడించారు. గల్ఫ్​ దేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.

Read Also: రోజూ తలనొప్పి వస్తుందా.. డిజిటల్ స్క్రీన్లే కారణం..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>