కలం, వెబ్ డెస్క్: దేశంలో నిన్న మొన్నటి వరకు విమానాలు, స్కూళ్లు, కోర్టులకు బాంబు బెదిరింపులు(bomb threat) రావడం కలకలం రేపింది. తాజాగా ఆగంతకులు రైళ్లను టార్గెట్గా చేసుకున్నట్లు తెలుస్తోంది. వందేభారత్(Vande Bharat) రైళ్లను పేల్చేస్తామని ఓ ఆగంతకుడు రైల్వే అధికారులకు లేఖ రాశాడు. హైదరాబాద్(Hyderabad)లో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉంటున్నారని, ఈ నలుగురు రైళ్లను పేల్చేందుకు ప్లాన్ వేశారని లేఖలో పేర్కొన్నాడు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వందేభారత్ రైళ్లు వెళ్లే మార్గాల్లో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఫిబ్రవరి 3న పోస్టులో జీఎంకి పంపించినట్లు సమాచారం. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని వందేభారత్ రైళ్లలో తనిఖీలు చేపట్టారు. రైళ్లు నడిచే లైన్లలో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.


