కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ హిందువుల మీద దాడులు ఆగడం లేదు(Bangladesh). తాజాగా పూజలు చేసుకుంటున్న హిందువులపై దాడి జరగడం దీనికి నిదర్శనం. బంగ్లాదేశ్లోని కొమిల్లా ప్రాంతంలో పూజలు చేసుకుంటున్న హిందువులపై దుండగులు బాంబులు విసిరారు. దీంతో పలువురు గాయపడ్డారు. బాంబులు పేలడంతో సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ఈ ఘటనలో పూజారి కేశ్ చక్రవర్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు(Bangladesh). కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, నిరుడు బంగ్లాదేశ్లో ఇంక్విలాబ్ మాంచో సంస్థ నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకోవాల్సిన అప్పటి యూనస్ సారథ్యంలోని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అల్లర్లో పదుల సంఖ్యలో హిందువులు హత్యకు గురయ్యారు. ఇటీవల బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఎన్నికలు జరిగి తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది. అయితే, హిందువులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఈ సంఘటనతో అర్థమవుతోంది.

