కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ (BJP) అంచనాలను మించి దూసుకుపోతోంది. స్పష్టమైన విజయం దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ (మెజార్టీ మార్క్ 147)ను దాటి 170 లీడింగ్లో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు దశాబ్ద కాలంగా రాష్ట్రంపై తిరుగులేని పట్టు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం ఈసారి గతి తప్పినట్లు కనిపిస్తోంది. ఓటర్ల తీర్పు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారుతుండటంతో, బెంగాల్ గడ్డపై కమలం వికసించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: దూసుకెళ్తున్న టీవీకే.. టెంట్లు తొలగిస్తున్న డీఎంకే!
Follow Us On: Instagram

