కలం, డెస్క్ : మెట్ పల్లి (Metpally) మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో రచ్చ మొదలైంది. బీజేపీ 10 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. చైర్మన్ పదవి దక్కలేదు. 6 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కు బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా ఓటు వేశారు. ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ చైర్మన్ కుర్చీని దక్కించుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి విప్ జారీ చేయకపోవడం వల్లే చెట్లపల్లి మీనా ఓటు వేసిందంటూ ఆ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది.
Read Also: జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. పార్టీ మారబోతున్నారా?
Follow Us On : WhatsApp


