కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) తన ముద్రను బలంగా వేస్తూ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. గతంలో నామమాత్రపు ఉనికికే పరిమితమైన ఆ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగి గణనీయమైన స్థానాలను కైవసం చేసుకునేదిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. రాష్ట్రంలోని మారుతున్న రాజకీయ సమీకరణలు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల కృషి ఫలితంగా బెంగాల్ గడ్డపై బీజేపీకి ప్లస్ కానుంది. ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా, హిందూత్వ నినాదం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీకి గాలి వీచే అవకాశం ఉంది.

