ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్నానిదే బాధ్యత : బీజేపీ చీఫ్​

కలం, వెబ్​ డెస్క్​ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవవహరిస్తోంది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్​. రామచందర్​ రావు (Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనకు పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్​ చేశారు. 41 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరంగల్​ నర్సంపేట డిపో బస్​ డ్రైవర్​ శంకర్​ గౌడ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన (Ramchander Rao) దుయ్యబట్టారు. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలని రామచందర్​ రావు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల ప్రధాన డిమాండ్​ ను వెంటనే నెరవేర్చాలన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆయన ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుంది అని రామచందర్​ రావు భరోసానిచ్చారు.

Read Also: ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు.. ఆ డిమాండ్స్ కి గ్రీన్ సిగ్నల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>