కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగర పరిధిలోని బుడగజంగాల కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బీహార్కు చెందిన ఓ వ్యక్తిని శనివారం హత్యకు గురయ్యాడు. మిల్స్ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు బుడగ జంగాల కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఇద్దరిలో ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయాడు. సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

