epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్​ ట్యాక్సీతో డ్రైవర్లకు లాభాలు : అమిత్​ షా

కలం, వెబ్​ డెస్క్​ : ఓలా, ఉబర్​ ట్యాక్సీలకు ప్రత్యామ్యాయంగా త్వరలోనే భారత్ ట్యాక్సీ (Bharat Taxi) సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అమిత్​ షా (Amit Shah) ప్రకటించారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, డ్రైవర్లకు ఆర్థిక లాభాలు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పారు.

బుధవారం హరియాణాలో జరిగిన సహకారి సమ్మేళనంలో అమిత్​ షా పాల్గొని ప్రసగించారు. సమ్మేళన్‌లో పాల్గొన్న అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న భారత్​ ట్యాక్సీ సేవల్లో వచ్చే లాభాలను పూర్తిగా డ్రైవర్లకే పంచే విధంగా రూపొందించినట్లు వెల్లడించారు.

దీని ద్వారా డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేవలు అందుతాయని అమిత్​ షా తెలిపారు. ప్రస్తుతం యాప్​ యాప్​ ఆధారిత ట్యాక్సీ సేవలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో Bharat Taxi యాప్​ సేవలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>