కలం, వెబ్ డెస్క్ : స్నేహితురాలితో గొడవ కారణంగా ఓ యువకుడి పెట్రోల్ బాంబు పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన నాగేంద్ర (30) అనే వ్యక్తి తన స్నేహితురాలు రమ్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాదన జరగడంతో నాగేంద్ర తమకూరు జిల్లా సీరా సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే పెట్రోల్ బాంబుతో ఆత్మహుతికి పాల్పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో భారీగా మంటలు చెలరేగడంతో హైవేపై పెద్ద ఎత్తున పొగ అలుముకుంది.
సంఘటపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, రమ్య తన ప్రేమను అంగీకరించకపోవడం వల్లే నాగేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On : WhatsApp

