కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 ఫైనల్ పోరులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఆర్సీబీ అభిమానులు తమ జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భక్తులు, అభిమానులు కలిసి భారీ హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ తుది పోరులో ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. తమ అభిమాన జట్టుపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

