epaper
Monday, November 17, 2025
epaper

ఆసియా కప్ ట్రోఫీ కోసం రంగంలోకి ఐసీసీ..

ఆసియా కప్(Asia Cup) 2023 ఛాంపియన్స్ కప్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. పాకిస్థాన్ మంత్రి చేతుల మీదగా కప్ తీసుకోవడానికి నిరాకరించింది. దాంతో కప్‌ను ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ(Mohsin Naqvi).. పాక్‌కు తీసుకెళ్లాడు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆసియా కప్‌ను భారత్‌కు అప్పగించాలని బీసీసీఐ(BCCI) లేఖ రాస్తే.. టీమిండియా కెప్టెన్‌ను వచ్చి తీసుకోమంటూ నఖ్వీ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిని పరిష్కరించడం కోసం తాజాగా ఐసీసీ రంగంలోకి దిగింది. శుక్రవారం జరిగిన ఐసీసీ బోర్డ్ సమావేశంలో ఈ అంశాన్ని బీసీసీఐ లేవనెత్తింది. తమకు ట్రోఫీని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అందుకు అంగీకరించిన ఐసీసీ.. ఈ సమస్యను పరిస్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

బీసీసీఐ, పీసీబీతో మంచి సంబంధాలు ఉన్న ఒమన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ.. ఈ కమిటీకి నాయకత్వం వహిస్తారని ఐసీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి సైకియా మాట్లాడుతూ.. నఖ్వీ నుంచి ట్రోఫీ(Asia Cup) తీసుకునే పనయితే.. ఫైనల్స్ అయినప్పుడే తీసుకుని ఉండేవాళ్లమని అన్నారు. ఈ వివాదం మరింత పెద్దది అవుతున్న క్రమంలో ఐసీసీ మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పింది.

Read Also: విజయ్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>