కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్ జిల్లా రేకొండలో ఆటో (Auto) ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆటో డ్రైవర్ దిలీప్తో కలిసి కొత్తపల్లి వైపు ప్రయాణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాన్ని స్వయంగా అందించారు. ఈ ప్రయాణంలో బండి సంజయ్ ఆటో డ్రైవర్తో ముచ్చటిస్తూ, మోదీ ప్రభుత్వ పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో ప్రజలకు నచ్చిన కార్యక్రమాలు ఏమిటనే విషయాలపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు.

