బండి భగీరథ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ .. పోలీస్ బృందాల గాలింపు

కలం, వెబ్ డెస్క్ : బండి భగీరథ్ (Bandi Bhagirath ) పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ మేరకు బండి భగీరథ్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 5 బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌ సహా భగీరథ్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. దీంతో బండి భగీరథ్ మరికాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>