కలం, వెబ్ డెస్క్: పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ (Bandi Bhageerath) బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇదివరకే ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విని తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల కాలేజీ పరీక్షలు రాసేందుకు వీలుగా వారం రోజులపాటు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువులో ఆయన పరీక్షలకు హాజరయ్యారు. ఈ తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన నేపథ్యంలో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలా లేదా అనే అంశంపై హైకోర్టు రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Read Also: అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాం: హరీశ్ రావు
Follow Us On: Instagram

