epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కేసీఆర్​ పై ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdary) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీదపడి ఏడవడం బీఆర్ఎస్​ పార్టీకి బాగా అలవాటు అయిందని ఆయన మండిపడ్డారు. బుధవారం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్​ (KCR), బీఆర్​ఎస్​ (BRS) నాయకులపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్​ తమకంటే జూనియర్​ అని.. ఆయన రాజకీయంగా ఎదిగింది టీడీపీలో కాదా? అని అన్నారు.

తెలుగు దేశంలో ఉన్నప్పుడు కేసీఆర్​ కు మంత్రి పదవి ఇవ్వకుండా విజయరమణారావుకి ఇచ్చారని ఉద్యమాలు చేశాడని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. కేసీఆర్​, కేటీఆర్​ తప్పుడు విధానాలు పాటిస్తున్నారని.. వాళ్ల మీద ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయన్నారు. వీటిని తట్టుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు మీద ఏడుస్తున్నారని బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdary) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: అక్కడ దీక్ష చేస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన..

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>