క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌కు ష‌ర్మిల‌.. అర‌టి పండ్ల బండితో హంగామా!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) నేడు క‌డ‌ప (Kadapa) క‌లెక్ట‌రేట్‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. స్వ‌యంగా బొలెరో వాహ‌నం న‌డుపుతూ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు జిల్లాలో అర‌టి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులంద‌రినీ ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు అరటి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి కలెక్టరేట్ వ‌ర‌కు స్వయంగా అరటి పండ్లు ఉన్న బొలెరో వాహనాన్ని నడుపుతూ వెళ్లారు. జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి రైతుల సమస్యను వివరించారు. ష‌ర్మిల వెంట కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.

Read Also: పర్యాటక శాఖపై సీఎం సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>