రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు : మంత్రి ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు అని.. కొరతపై వస్తున్న ఫేక్ న్యూస్ అపోహలు నమ్మెద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కావాల్సినంత పెట్రోల్ ఉందని ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దు అని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని.. రెండు నెలలకు సరిపడా ఇంధనం స్టాక్ ఉందని తెలిపారు. వదంతుల వల్లే హైదరాబాద్ లో ఈ పరిస్థితి వచ్చిందని.. వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం క్యూ లైన్లు కట్టొద్దని కోరారు. అలాగే, తన హెలికాప్టర్ గురించి హరీశ్ రావు మాట్లాడితే కామెడీ అనిపించిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. తాను గంటకు 2500 km వేగంతో విమానం నడిపించానని చెప్పారు. భారత సరిహద్దులో యుద్ధంలో పాల్గొన్నట్లు తెలిపారు. అత్యంత డిసిప్లిన్ సర్వీస్ లో ఉన్న తాను.. ఇప్పుడు ఎక్కడ ఉన్నానో అందరికీ తెలుసన్నారు.

ఎస్సెల్బీసీ ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) .. ప్రాజెక్టు పరిశీలనకు మరో ముగ్గురు ఆర్మీ ఎక్స్ పర్ట్స్ ను నియమించామని, మానిటర్ చేసేందుకు మరో అధికారిని నియమించినట్లు తెలిపారు. పరీక్షిత్ మెహ్రా కింద అధికారులు అసోసియేట్ గా పనిచేస్తున్నారని చెప్పారు. సొరంగంలో అధునాతన వెంటిలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>