వైసీపీ ప్రభుత్వం రుషికొండ(Rushikonda)లో నిర్మించిన విలాసవంతమైన భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భవనాలను ఎలా వినియోగించాలి అనే అంశంపై ప్రజల నుంచి సూచనలు కోరింది. ఈ మేరకు పర్యాటక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటనను టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపాలీ ప్రకటనను విడుదల చేశారు. ప్రజలు తమ సూచనలను rushikonda@aptdc.in కి పంపాలని ఆమె వివరించారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పౌరులు, సంస్థల సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. ఆ సంస్థల నుంచి కొన్ని సూచనలు తీసుకోనున్నామని, వాటిని ప్రజలు ఇచ్చిన సూచనలను మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. ఆ సమీక్ష తర్వాత రుషికొండ(Rushikonda) భవనాల వినియోగంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

