కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాజధాని అమరావతి (Amaravati) పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన క్రమంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అమరావతిలో మొత్తం రూ. 2,540 కోట్లతో అభివృద్ధి చేయాలని తాజాగా ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది.
అంతేకాదు అసెంబ్లీ పరిసరాల్లో వర్క్స్ కు రూ. 798 కోట్ల ప్రతిపాదనకు , అలాగే ఉండవల్లి జోన్ లో మౌలిక వసతులకు రూ. 580 కోట్ల ప్రణాళికలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగుతుండగా.. మరిన్ని కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.

