కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి కల్తీ పాల (Rajahmundry Adulterated Milk) ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బండారు వీర లక్ష్మి అనే వృద్ధురాలు నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. నిన్న ఇదే ఘటనతో చికిత్స పొందుతూ మూడేళ్ల చిన్నారి జయకృష్ణ ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు మరో ఏడుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

