epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏపీలో పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల

కలం, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లో పాస్టర్లకు గౌరవ వేతనం (Honorarium to Pastors) చెల్లిస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. ఇటీవల సెమీ క్రిస్​మస్ ​వేడుకల్లో పాల్గొన్న సీఎం.. పాస్టర్లకు గౌరవ వేతనం ఈ నెల 24లోగా చెల్లిస్తామని మాటిచ్చారు. అన్నట్లుగానే  నేడు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో నిరుడు డిసెంబర్ నుంచి ఈ ఏడాది వరకు చెల్లించాల్సిన గౌరవ వేతనం నిధులు విడుదలయ్యాయి. ఒక్కో పాస్టర్​కు నెలకు రూ.5వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,148 మంది పాస్టర్లకు రూ.50కోట్ల 50లక్షల నిధులను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో క్రిస్​మస్ వేడుకలకు ప్రభుత్వం గౌరవ వేతనం రూపంలో కానుక ఇచ్చిందని పాస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ‘పోలవరం’ పనులను పరిశీలించిన పీపీఏ బృందం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>