కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers Transfers) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఏపీఈడీబీ సీఈవోగా సగిలి షణ్మోహన్ నియామకం అయ్యారు. ఏపీఐఐసీ ఎండీగా ఎ.ఎస్.దినేశ్ కుమార్ నియామకమయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా సాయికాంత్ వర్మను నియమించగా, ఇక విశాఖ జిల్లా కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్ నియామకమయ్యారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, అల్లూరి జిల్లా కలెక్టర్గా టి. నిశాంతి, ఇక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా తమీమ్ అన్సారియాల నియామకం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

